TTD వేంకటేశ్వరస్వామి భద్రతను ప్రైవేటు సంస్థకు అప్పగించటం ద్వారా టిటిడి మరోసారి వివాదంలో కూరుకుపోయింది. ఆలయ భద్రతకు ముఖ్యమైన సిసి కెమెరాల నిర్వహణ బాధ్యతను టిటిడి రక్ష అనే ప్రయివేటు సంస్థకు అప్పగించింది. దీనిపై టిటిడిని ప్రశ్నిస్తే విజిలెన్సు తర్ఫీదు అంటూ కారణాలు చూపిస్తోంది. దీంతో అంతటా టిటిడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమల తిరుపతిలో ఆలయానికి సరిపడే భద్రత ఉన్నప్పటికీ టిటిడి ప్రయివేటు సంస్థకు సిసి కెమెరా నిర్వహణను అప్పగిస్తోందని తిరుమల తిరుపతి సంరక్షణా సమితి ఆరోపిస్తుంది. భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామంటున్న అధికారులు ఇలా ప్రైవేటును ఆశ్రయించటం ద్వారా తమ భద్రతా లోపాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన తిరుమల రక్షణను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఆలయ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
No comments:
Post a Comment