tirupati hotels

tirupati hotels
tirupati holiday packages

Tuesday, October 5, 2010

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం: భయాందోళనలో భక్తులు

శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధానమైన తిరుమలలో మళ్లీ చిరుత కనిపించింది. ఇంతకుముందు పలుమార్లు చిరుత కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. రెండుమూడు సార్లు చిరుత కనిపించటంతో కాలినడకన వెళ్ళే భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించటంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు.

టిటిడి అధికారుల పట్ల భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. టిటిడి భద్రత విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు చిరుత సంచారం ఉన్నప్పటికీ టిటిడి పటిష్ట భద్రత కల్పించక పోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తిరుమలలో చిరుతలు కనిపించాయి. భక్తులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఓ చిరుత అధికారులకు చిక్కింది కూడా.

No comments:

Post a Comment